సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి,
హుజురాబాద్ ఆగస్టు 16: ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందుకు టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షు డు ప్రొఫెసర్ కోదండరాంని ఎమ్మెల్సీగా నియమించినందు కు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు,తెలంగాణ మంత్రివర్గానికి ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.గత ప్రభుత్వంలో పది సంవత్సరా లు కేసీఆర్ ఉద్యమకారులను గుర్తించకుండా,గౌరవించ కుండా అణచివేత ధోరణి అవలంబించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలం గాణ ఉద్యమ కారులను గుర్తిస్తూ,గౌరవిస్తూ సముచిత స్థానం కల్పిస్తున్నం దుకు తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నదని పేర్కొ న్నారు.ప్రజలందరికీ నాణ్యమై న,ఉచిత విద్యను అందిం చేందుకు,విద్యావ్యవస్థ పటిష్ట పరిచేందుకు కోదండరాంని మంత్రి వర్గంలోకి తీసుకుని విద్యాశాఖను కేటాయించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు










