సామాజిక సేవలో జూపాక వాసి దేవరాజ్ కు ప్రశంస ఏపీ మంత్రి పార్ధసారధి చేతుల మీదుగా సత్కారం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి:హుజూరాబాద్ :హుజూరాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన పెరుమాండ్ల దేవరాజ్ సామాజిక నిపుణులు ఏపీ రాష్ట్రంలోని ఎన్జీవో రంగంలో రాణిస్తున్నాడు. కాగా దేవరాజ్ అందిస్తున్న పలు సామాజిక సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ సేవ ప్రశంసకు ఎంపిక చేసింది. సామాజిక సేవ, ప్రజలను చైతన్యపర్చడంలో, భూ సేకరణ చట్టం 2013, పునరావాసం, పునః నిర్మాణం ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదిక రిపోర్టులు, రాష్ట్ర స్థాయిలో వందల ప్రాజెక్టులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరించి ప్రజలకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతిఫలాలను, లాభాలను ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు,ఆర్అండ్బి, ఇరుగేషన్, స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్, జల జీవన్ మిషన్, రెవెన్యూ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గానూ గురువారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏ పీ మంత్రి కొలుసు పార్ధసారధి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప శివకిషోర్,జిల్లా జడ్జి పురుషోత్తంకుమార్లు అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !