సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ డిమాండు.

బహుబలం న్యూస్ హుజురాబాద్
ఆగస్టు 12 ,:సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతన చట్టం అమలుచేసి మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం మండల కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం హుజురాబాద్ మండల కేంద్రంలోని విద్యా వనరుల కార్యాలయంలో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు హుజురాబాద్మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 15 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ భద్రత లేక సరైన వేతనాలు అందక చాలీచాలని జీతాలతో బ్రతుకులు వెళ్లదీసుకుంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు కనీస వేతనం.. టైం స్కేల్ అమలు చేసి, మరణించిన ఉద్యోగులకు వెంటనే 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల యెడల సమగ్ర శిక్ష ఉద్యోగుల రాష్ట్ర కమిటీ కార్యాచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఆర్పీలు రాజీరెడ్డి రవిబాబు రమేష్ చక్రపాణి బిస రమేష్ ఆపరేటర్ మధు అటెండర్ తదితరులు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !