ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండి మరణించిన వారి నామిని ఇన్సూరెన్స్ కు అప్లై చేసుకోండి. సహాయ కార్మిక అధికారి డి. చందన.

బాహుబలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 12:
ఈ శ్రమ్ కార్డు కలిగి ఉండి ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళ నామిని మరియు ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురైన కార్మికులు ఈ శ్రమ్ కార్డు ఇన్సూరెన్స్ ఉప కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం కరీంనగర్ ఇంటి నెంబర్ 7-2-1001, పొన్నం కాంప్లెక్స్ మంకమ్మ తోట కరీంనగర్ నందు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నేల ఆఖరి తేదీ 31.8.2024,అయితే 25-8-2024 వరకు దరఖాస్తులు సమర్పించవల నని హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి డి చందన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు ఉప కార్మికశాఖ కమిషనర్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని.ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుని కుటుంబా నికి 2 లక్షలు. ప్రమాద వశాత్తు అంగవైకల్యం కలిగిన కార్మికునికి లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, తెలిపారు. డెత్ సర్టిఫికెట్, పోస్టుమార్టం రిపోర్టు శవపంచనామ నివేదిక,నామినీ ఆధార్ మరియు బ్యాంకు ఖాతా నెంబరు బుక్,కార్మికుని ఈ శ్రమ్ కార్డు కార్మికుని ఆధార్ కార్డు,ఈ సర్టిఫికెట్స్ రెండు సెట్స్ తో కరీంనగర్ ఉప కార్మిక శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కార్మికులు కార్మికులు.ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోగలరని హుజురాబాద్ సహాయ కార్మిక అధికారిణి డి.చందన ఒక ప్రకటనలో తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….