ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు సామాజిక న్యాయాన్ని నిలబెట్టింది…-ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

బాహుబలం ప్రతినిధి, కరీంనగర్ ఆగస్టు 1:
-ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చిన చారిత్రక తీర్పు సామాజిక న్యాయాన్ని నిలబెట్టిందని రైతు, ప్రజాసంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు అన్నారు. సుప్రీం తీర్పుతో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వారికి విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరుగుతుందని ఇది రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శ నమని రామారావు అన్నారు. ఎంఆర్ పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని గౌరవించి అప్పటి ఉమ్మడి రాష్ట్ర, ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెచ్చిన వర్గీకరణ చట్టం వల్లే న్యాయం జరిగిందన్నారు.ఎన్నో నిర్బందాలను, ఆటు పోట్లను తట్టుకొని మందకృష్ణ మాది గ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలలోని ఉప కులాల వారికి విద్యా ఉద్యోగాల్లో సామాజిక న్యాయం చేయాలని 30 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ పోరాటానికి సుప్రీం తీర్పుతో దక్కిన న్యాయం శుభ పరిణామం అని, మడమ తప్పకుండా అలుపెరుగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు రైతు ప్రజాసంఘాల తరపున పోలాడి రామారావు అభినందన లు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….