విద్యారంగాన్ని విస్మరించిన తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ -నిరుద్యోగుల ఆశలపై నీళ్ళుచల్లిన కాంగ్రెస్.. -అరకోర నిధులు విద్యార్థుల పాలిటశాపం.. -ఏబివిపి రాష్ట్ర నాయకులు అజయ్..

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజురాబాద్ .
జూలై 27:
విద్యార్థుల,నిరుద్యోగుల ఆత్మ బలిదానాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ ఆరోపించారు.తెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేషపెట్టిన రాష్ట్ర బడ్జెటుపై అజయ్ స్పందిస్తూ ,నాణ్య మైన విద్య అందించడం దేవుడెరుగని,కనీస విద్యను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వం మాదిరిగానే విద్యార్థుల,నిరుద్యోగుల ఆశలు,ఆశయాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు చల్లిందని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీఎంబర్సుమెంటు ,ఉపకారవేతనా లు  రూ.7వేల కోట్లకుపైగా పెండింగులో ఉన్నాయని,సకా లంలో ఫీజులు రాక ఉన్నత విద్యకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామని విద్యార్థులను మభ్యపెడుతూ ప్రభుత్వరంగ యూనివర్సిటీలను పూర్తిగా పట్టించు కోలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా వ్యవస్థల ను ప్రోత్సహిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడునెలలు కావస్తున్నా,యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్లను నియమించలేని దుర్భాగ్యమైన పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.వెంటనే యూనివర్సిటీలకు విసిల నియామకం చేపట్టాలని,నాణ్యమైన విద్యను అందించేలా బడ్జెటుని పునరాలోచించి,విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలని అజయ్ అల్టిమేటం జారీ చేశారు.లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంటపడుతామని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..