లింగ నిర్ధారణ చేసి అబార్షన్లకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై ప్రజావాణిలో ఫిర్యాదు

సబ్బనీ వెంకటస్వామి బాహు బలం ప్రతినిథిహుజూరాబాద్

హుజురాబాద్ జమ్మికుంట పట్టణాలలో ప్రైవేట్ ఆస్పత్రు లు నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ చేసి యదేచ్చగా బృణ హత్యలకు పాల్పడుతున్న ఆసుపత్రుల పై చర్య లు తీసుకుని బృణ హత్యలకు సహకరిస్తున్న వైద్యులను గుర్తించి వారి గుర్తింపును రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో ఈరోజు జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కి యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ పర్లపల్లి నాగరాజులు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజురాబాద్ జమ్మికుంట ప్రాంతంలో విచ్చలవిడిగా వెలిసినటువంటి ఆసుపత్రులపై అదే విధంగా స్కానింగ్ సెంటర్లు ల్యాబ్ ల పై చర్యలు తీసుకో ని పేద ప్రజల వైద్య అవసరాలను ఆసరాగా చేసుకుని స్కానింగ్ లు పరీక్షల పేరిట వేలాది రూపాయలు దండు కుంటూ వైద్యాన్ని వ్యాపారం చేస్తున్నారు ఇట్టి ఆసుప త్రులకు సంబంధించినటు వంటి వారికి సంబంధించిన మెడికల్ షాప్ లలోనే మందులు తీసుకోవాలని సూచిస్తూ మెడికల్ మాఫియా కొనసాగిస్తున్నారు.గతంలో సైతం లింగనిర్ధారణ పరీక్షలు చేసి పట్టుబడిన ఆసుపత్రులపై నామమాత్రపు చర్యలు తీసుకోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి కావున ఇట్టి హాస్పటల్ లను గుర్తించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నటువంటి సదరు ఆసుపత్రులపై స్కానింగ్ సెంటర్ లపై మెడికల్ షాప్ లపై శాఖాపరమైన చర్యలు తీసుకొవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఇప్పలపల్లి చంద్రశేఖర్ కమటం సందీప్ తదితరులు పాల్గొన్నా రు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !