సబ్బని వెంకటస్వామి బాహు బలం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 14:
హుజురాబాద్ మున్సిపల్ రిటైర్డ్ ఉద్యోగి రొంటాల వైకుంఠం అనారోగ్యంతో ఆదివారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లో గల తన స్వగృహంలో మృతి చెందారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హుజురాబాద్ అంబేద్కర్ వాదులు, ప్రజాసంఘాల నాయకులు,వివిధ రాజకీయ పార్టీల నాయకు లు గాంధీనగర్ లోని ఆయన స్వగృహానికి వెళ్లి మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.స్వర్గీయ రొంటాల వైకుంఠం మున్సిపాలిటీలో ఉద్యోగం చేసే క్రమంలో అందరితో కలిసి మెలిసి ఉండేవాడని,అందరితో అజాత శత్రువుగా ఉండి అందరి మన్ననలు పొందేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ముగ్గురు కొడుకుల కు ఉన్నత విద్యను అందించి అందరిని ప్రభుత్వ ఉద్యోగులు గా తీర్చిదిద్దాడని ఆయన కృషిని నెమరువేసుకున్నారు.నివా ళులు అర్పించిన వారిలో జయన్న ఫౌండేషన్ చైర్మన్ గుడి పాటి జయపాల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్,ఎంఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం ,డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి,డాక్టర్ తడి కమళ్ళ శేఖర్,మట్టేడ ప్రకాష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్ర రవీందర్,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు రామగిరి అంకుష్,వేల్పుల ప్రభాకర్,ఇల్లందుల సమ్మయ్య,రాంరాజేశ్వ ర్,మిడిదొడ్డి సుధాకర్,నమిండ్ల రవీందర్,బొడ్డు ఐలయ్య, బొరగాల మొగిలి,రేణిగుంట్ల సందీప్,గాజుల సంపత్,మొలు గు శ్రీధర్ బల్దియా ఉద్యోగులు సిబ్బంది తదితరులు ఉన్నారు.










