బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 13:
హుజూరాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో ఉన్న ఆర్ఆర్ ఆర్ వైన్స్ లో కొనుగోలు చేసిన బీర్ లో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. బీర్ ఓపెన్ చేసి సగం తాగాక గమనించగా అందులో పురుగు కనబడింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మద్యం ప్రియుడు వాంతి చేసుకున్నాడు వెంటనే ఆ బీరును పట్టుకెళ్లి మద్యం షాపు కౌంటర్ లో చూపించగా షాపు నిర్వాహకుడు దానికి బదులు వేరే బీరు ఇచ్చాడు.జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామ పరిధిలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామానికి చెందిన పుల్లూరు సంపత్ సొంత పనిమీద హుజురాబాద్ కు వచ్చాడు. పని ముగించుకొని తిరిగి జమ్మికుంట వైపు వెళ్తుండగా పట్టణ శివారులోని అదే రోడ్లో గల ఆర్ఆర్ఆర్ వైన్స్ లో బీర్ తీసుకొని తాగుతుం డగా అందులో పురుగు దర్శనమిచ్చింది. దానిని గమనించిన సదరు వ్యక్తి వెంటనే కౌంటర్ మీదికి వెళ్లి చూపించగా అతని బీరు తీసుకొని ఇంకో బీరు ఇచ్చాడు. ప్రజల ప్రాణాలతో చెలగాటమా డుతున్న బీరు కంపెనీలపై చర్యలు తీసుకోవాల ని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఆర్ఆర్ఆర్ వైన్స్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు సంపత్ కోరారు.
హుజూరాబాద్ లో నీ అన్ని వైన్స్ షాప్ లలో ఉన్న బీర్లను తనిఖీ చేయాలి
మద్యం ప్రియుల డిమాండ్….
హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ ఆర్ వైన్ షాపులో బీరులు పురుగు రావడం వల్ల ఆ యొక్క ఆర్ ఆర్ ఆర్ ఒక్క షాపును కాకుండా పట్టణంలోని అన్ని వైన్ షాపులలో యున్న బీర్లను తనిఖీ చేయాలని మద్యం ప్రియులు ఎక్సైజ్ అధికారులను డిమాండు చేస్తున్నారు











