(సబ్బనివెంకటస్వామి బాహుబలంప్రతినిధి)
హుజూరాబాద్ జూలై 08 హుజురాబాద్ పట్టణానికి చెందిన నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావు
వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ అందుకున్నారు.ఈ సందర్భంగా నాగార్జున డైరీ ఎండి పుల్లూరి ప్రభాకర్ రావును ఆదివారం రోజున డెయిరీ ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించారు.ఉద్యోగస్తులు మాట్లాడుతూ ఆశయ సాధకుడు ,నిరంతర శ్రామికుడు ఎం.డి పుల్లూరు ప్రభాకర్ రావు కు వాషింగ్టన్ డిజిటల్ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ పొందడం సంతోషకరమైన విషయం అని నాగార్జున ప్లాంట్ మేనేజర్ మాటూరు శ్రీనివాస్,క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ బందెల శ్రీనివాస్, మెయింటెనెన్స్ మేనేజర్ సంతోష్ చారి కొనియాడారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గణేష్ రావు సీఈవో కృష్ణ ప్రసాద్ ఏజీఎం సుధాకర్ మరియు ప్రొక్యూర్మెంట్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 108










