సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి
హన్మకొండ జులై 08:
సోమ వారం రోజున హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణం లో నవ్వుల చక్రవర్తి చార్లీ చాప్లీన్ జయంతి ని పురస్కరించుకుని రోజా క్రియేషన్స్, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్తంగా ఏప్రిల్ నెలలో నిర్వహించిన చిత్ర కళ పోటీలకు సంబందించిన ఫలితాలు విడుదల చేసి 5 విభాగాల్లో ప్రథమ,ద్వీతీయ,తృతీయ బహుమతులు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ సంస్థల డైరెక్టర్లు ఆలేటి శ్యామ్ సుందర్,సాగంటి మంజుల అందజేశారు.. అదే కార్యక్రమంలో ఎ ఎ క్రియేషన్స్ వారి చాక్లెట్ ( మత్తు )అనే షార్ట్ ఫిల్మ్ ని గౌరవ ఎం ఎల్ ఎ లు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, అర్చక సంఘం అధ్యక్షులు గంగు ఉపేంద్ర శర్మ విడుదల చేసారు.. ఈ కార్యక్రమం లో ఏసీపీ విజయ్ కుమార్, ఎస్ ఐ లు రామారావు,ఎన్ కవిత, డైరెక్టర్ అజయ్,ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు










