పిల్లల్లోని సృజనత్మాకతను వెలికి తీయాలి.. సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల.

(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి ) హన్మకొండ జులై 07,:ఆదివారం రోజు నెరేళ్ళ వేణు మాధవ్ కళా ప్రాంగణంలో జరిగిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వారి 11 వ డ్రాయింగ్ కాంపిటీషన్ 70 మందికి పైగా చిన్నారులు పాల్గొ న్నారు.ఆడపిల్లను కాపాడండి అనే అంశంపైన ఈ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల మాట్లాడుతూ పిల్లల్లో కళలపట్ల ఆసక్తి తల్లిదండ్రులు గమనించి ఆ కళకుపదును పెట్టె దిశగా ఎదగనివ్వాలని,ఈ మధ్య కాలంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అన్యాయాలను గురించి మాట్లాడుతూ ఆడ పిల్లలను ఎలా పెంచాలో తెలుసు కోవడమే కాదు మగపిల్లల్ని ఎలా పెంచకూడదో కూడా తల్లిదండ్రులు తెలుసు కోవాలని విజ్ఞప్తి చేశారు.తన ప్రయత్నం వాళ్ళలో కొందరిలోఐన మార్పురావాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త డికెన్స్,ఆర్టిస్ట్ రజినికాంత్,కవయిత్రి ప్రసూన తల్లిదండ్రులు పాల్గొన్నారు.పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా పోటీల్లో పాల్గొనడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !