(సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజూరాబాద్ జూలై 07:
ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 వసంతాలు పూర్తయిన సందర్భంగా మరియు మహాజన నేత మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా హుజురాబాద్ గాంధీనగర్ రోడ్ లో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి రవీందర్ మాదిగ,ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేశారు తర్వాత కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు రుద్రారపు రామ చంద్రం మాట్లాడుతూ మాదిగల ఆత్మగౌరవం కోసం షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్ల లో ఉపకులాల జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలని లక్ష్యంతో 30 సంవత్సరాల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడిందని ఆనాటి నుండి ఎన్నో వీరోచితమైన పోరాటాలు చేసి పాల కులను ఒప్పించి ఎస్సీ వర్గీకరణ కోసం మూడుసార్లు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాలు చేసిందని గుర్తు చేశారు. అదేవిధంగా జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్,జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్లు వర్గీకరణకు అనుకూలంగా నివేదికలు ఇచ్చినప్పటికీ పాలకుల నిర్లక్ష్యం వల్ల వర్గీకరణ కార్యరూపం దాల్చక పోవటం వల్ల మాదిగ ఉపకులాల విద్యార్థులకు విద్య ఉద్యోగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతుందని వివరించారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి వర్గీకరణ బిల్లు పార్లమెంటులో పెట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్,సైదాపూర్ మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, ఎంఐఎఫ్ గౌరవ అధ్యక్షుడు వేల్పుల రత్నం డాక్టర్ తడికమ ళ్ళ శేఖర్,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మారేపల్లి శ్రీనివాస్,రేణిగుంట్ల సాగర్,కలవల మల్లయ్య,ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రొంటాల రాజకుమార్,మాదిగ ఉద్యోగు ల సమాఖ్య జాతీయ నాయకులు మొలుగూరి కొమరయ్య, రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఇల్లందుల సమ్మయ్య,అంబేద్కర్ జయంతి కమిటీ మాజీ అధ్యక్షుడు తునికి సమ్మయ్య,
కళాకారుడు మేకల నవీన్,బొడ్డు మధుకర్,ముక్క రామస్వా మి,బత్తుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.










