దళిత బంధు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బాధితులు

సబ్బని వెంకటస్వామి,బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :
జూన్ 27:దళిత బందు రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు రెండో విడత సాధన సమితి ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా దళిత బంధు సాధన సమితి నాయకులు మాట్లాడుతూ.. దళిత బంధు రెండో విడత నిధులను విడుదల చేయడంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే రెండో విడత నిధులు రాలేదని ఆరోపించారు.దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టించి దళిత బంధు ను నిలిపివేశాడని అన్నారు.కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని పేర్కొన్నారు.కౌశిక్ రెడ్డిని నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు.ప్రస్తుత ప్రభుత్వం అయినా దళిత బంధు రెండో విడత నిధులను మంజూరు చేయాలని వారు కోరారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంప్ లోని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన సమితి హుజురాబాద్ నియోజకవర్గం సభ్యులు కోలుగూరి సురేష్, మంద రాజేష్,కోలుగూరి నరేష్,రామంచ రాకేష్,అకినపెల్లి ఆకాష్,దసరాపు నాగరాజు,రక్షిత్,బిక్షపతి, అరుణా,సరిత రీటా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….