(బాహుబలం ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా)జూన్27:
కార్పొరేట్,ప్రైవేటు ఫీజుల దోపిడీ నియంత్రించాలని,ప్ర భుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా డీఈవో రమేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు.ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తున్నా ప్రభు త్వం పట్టించుకో వడంలేదని వారు దుయ్యబట్టారు.ఎల్కేజీ నుండి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదం డ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నో,ఈ టెక్నో,ఐఐటి పేర్లతో తోక పేర్లను తగిలించి బోర్డు లను ఏర్పాటు చేసి యదేచ్చగా అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్య అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు.విద్యాహక్కు చట్టానికిి విరుద్ధంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం టెస్టులు పెడుతూ అడ్మిషన్లు బహిరంగంగా నమోదు చేస్తున్నారన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్లు నమోదు చేసి విద్యాసంస్థలలోనే పాఠ్యపుస్తకా లు అమ్మకాలు మొదలుపెట్టి విద్యాసంస్థలోనే వ్యాపారాన్ని కొనసా గిస్తున్నారన్నారు.ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజుల వివరా లను బోర్డులో ఏర్పాటు చేసి,బహిరం గపరచాలి,కానీ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. స్కూలు ఫీజులు, అడ్మిషన్ ఫీజులు,బస్ ఫీజులు,హాస్టల్ ఫీజులు,దోబీ ఫీజులతొ పాటు రకరకాల ఫీజుల పేరుతో డబ్బులు దండుకుంటున్న కనీసం అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని నియంత్రించకపోతే పి.డి.ఎస్.యు.ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు లోకిని రమేష్ నాయకులు సతీష్ తదితరులు పాల్గొన్నారు.










