ఉప్పొంగిన అభిమానం మధ్యన సబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు తరలివచ్చిన అభిమానులు..ఆత్మీయులు జిల్లా నలుమూలల నుండి వెల్లువెత్తిన శుభాకాంక్షలు..

(బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ జూన్ 21)
పేదప్రజల గుండె చప్పుడు… అయినవాళ్లకు ఆత్మీయుడు… ఎవరికి అర్థం కాని అపరిచితుడు… అర్ధరాత్రి వేళ కూడా స్పందించే వ్యక్తిత్వం ఉన్న మానవతమూర్తిగా ప్రశంసలు అందుకుంటున్న సబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు శుక్రవారం రోజున హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో అభిమానుల గ్రామస్తుల.సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగాయి.ప్రతి సంవత్సరం తన స్వగ్రామమైన సిర్సపల్లిలో గ్రామస్తుల సమక్షంలో.కుటుంబ సభ్యుల కేరింతల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆయనకు ఆనవాయితీ.ఇందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా జూన్ 21వ తేదీ శుక్రవారం రోజున హైదరాబాదు నుండి కుటుంబ సభ్యులతో సిర్సపల్లి గ్రామానికి తరలివచ్చిన సబ్బని వెంకట్ తన స్వగృహంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.బాహ్య ప్రపంచానికి అంతగా తన సేవలను ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని సబ్బని వెంకట్ సాదాసీదాగా తనపని ఏమిటో తాను చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు.హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట కమలాపూర్ వీణవంక ఇల్లంతకుంట హుజూరాబాద్ వావిలాల చల్లూర్ తదితర ప్రాంతాలలోని అనేక గ్రామాలతో ఆయనకు విడదీయలేని బంధం ఉన్నట్లు బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదు. సమాజం నుండి ఇంతవరకు ఏది ఆశించక పోయినప్పటికీ తాను పుట్టి పెరిగిన హుజురాబాద్ ప్రాంతం నుండి ఎవరైనా తన సహాయం కోరి వచ్చినట్లయితే కాదనే మనస్తత్వం కలిగిన సబ్బని వెంకట్ ఇప్పటివరకు ఎంతోమందికి తన సేవలను అందించి అభిమానాన్ని చాటుకున్నారు. వైద్యపరంగా విద్య పరంగా ఆర్థికపరంగా సబ్బని వెంకట్ కొంతకాలంగా అందిస్తున్న సహాయ సహకారాల గురించి అనేకమందికి తెలియకపోయినప్పటికీ లబ్ధి పొందిన వారి వల్ల ఆయన సేవలు సుగంధన్ల వాడవాడలకు విస్తరించిందని చెప్పక తప్పదు.అందువల్లనే శుక్రవారము జరిగిన సబ్బని వెంకట్ జన్మదిన వేడుకలు ఉదయం నుండి సాయంత్రం వరకు సిర్సపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా కోలహాలుగా జరిగాయని చెప్పక తప్పదు.అభిమానులు ఆయన వల్ల లబ్ధి పొందిన ప్రజలు తమకు తాముగా తీసుకువచ్చిన భారీ కేకును కట్ చేసి ఈ వేడుకలకు ఆయన స్వాగతం పలికారు.పార్టీలకు అతీతంగా కరీంనగర్ వేములవాడ చొప్పదండి పెద్దపల్లి మానకొండూర్ హన్మకొండ వరంగల్ హుస్నాబాద్ వేములవాడ సిరిసిల్ల హైదరాబాద్ ప్రాంతాల నుండి వందలాదిమంది మిత్రులు సహచరులు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వెంకట్ కు శుభాకాంక్షలు… అభినందనలు తెలియజేశారు.రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా మానవత్వం చాటుకున్న గొప్ప వ్యక్తిగా ఆయనకు హుజురాబాద్ పాత తాలూకాలోనే కాకుండా…. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం విధితమే. తాను ఏదో ఆశించి ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదని భగవంతుడు ఇచ్చిన సహకారం వల్లనే సమాజంలోని పేద వర్గాలకు తనకు తోచినంతగా సహాయం చేయడమే తన లక్ష్యమని పుట్టినరోజు సందర్భంగా సిర్సపల్లిగ్రామానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులతో సబ్బని వెంకట్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.తనకు శుభాకాంక్షలు తెలియజేసిన హుజురాబాద్ ప్రాంత పాత్రికేయులకు పలుజిల్లాల నుండి అభినందనలు తెలియజేసిన ఆత్మీయులకు ఈ సందర్భంగా వెంకట్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇకముందు కూడా సమాజంలో వివిధ రకాల ఇబ్బందులకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు తనకు తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటానని ఆయన ప్రకటించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….