దళారులను ఆశ్రయించి మోసపోకండి .. సహాయ కార్మిక అధికారి. శ్రీమతి చందన.

బాహుబలం న్యూస్(ప్రతినిధి వెంకటస్వామి)
హుజూరాబాద్ జూన్ 06.
హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు దళాలను ఆశ్రయించి,డబ్బు వృధా చేసుకుని మోసపోకండఅని హుజురాబాద్ డివిజన్ సహాయ కార్మిక అధికారి శ్రీమతి చందన అన్నారు.ఈ సందర్భంగా
ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ హుజురాబాద్ డివిజన్ పరిధిలోని భవన నిర్మాణ కార్మికులు కాని ఎవరైనా కార్మికులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా తమ కార్యాలయానికి వచ్చి వారి సమస్యలు తెలుసుకోవచ్చని,ప్రతి ఒక్కకార్మికుడు కొత్త లేబర్ కార్డు కొరకు దరఖాస్తు ఫామ్ మీ సేవలో రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి కార్మికుడు స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారం కార్యాలయంలో ఇచ్చి రిజిస్టర్ లో సంతకం చేయాలన్నారు మరియు యాక్సిడెంట్ డెత్,క్లైములు,సహజమరణము క్లైములు,పెళ్లి కానుక,మేటర్నిటీ సహాయం తదితర బెనిఫిషరీస్ ల కొరకు మీ సేవలో అప్లై చేసిన తర్వాత హుజురాబాద్ సహాయకార్మిక అధికారి కార్యాలయం నందు,అప్లికేషన్ ఫామ్ ఇచ్చి రిజిస్టర్లో సంతకం చేయవలెనని అన్నారు.మా కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తులకు రసీదు ఇవ్వబడునని అదేవిధంగా లేబర్ కార్డు కలిగి ఉన్న ప్రతి కార్మికుడు ఐదు సంవత్సరముల గడువులోపు రెన్యువల్ చేయించుకోవాలని రెన్యువల్ కానిచో ఎలాంటి క్లైములైన లబ్దిరాదని సహాయ కార్మిక అధికారి చందన ఈ సందర్భంగా తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….