( వెంకటస్వామి సబ్బని ప్రతినిధి )
బాహు బలం న్యూస్ హుజూరాబాద్ జూన్ 02:
హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లీ శ్రీమతి సోనియా గాంధీ కి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజా పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటి శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెరుమండ్ల బిక్షపతి గౌడ్ రావుల రాజేష్, బాణాల పేద్దులు, కృష్ణంరాజు, బాల్ రాజ్ రమణ, బిక్షపతి, సురేందర్, మెరుగు శ్రీనివాస్, రమేష్, విజేందర్, పెరుమండ్ల బిక్షపతి ,రంజిత్ యూత్ ప్రెసిడెంట్ ఎదులాపురం రాజు తదితరులు పాల్గొన్నారు
Post Views: 109










