బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 30
సిఐటియు 54వ ఆవిర్భవదినోత్సవం సందర్బంగా హుజురాబాద్ ఆర్టీసీ డిపో క్రాస్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరే రమేష్ఆద్వర్యంలో సి ఐ టి యు జండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరే రమేష్ మాట్లాడుతూ 1970 లో కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు 54 సంవత్స రాలు పూర్తి అయిన సందర్భంగా సిఐటియు,ఐక్యత పోరాటం కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.సిఐటియు ఆద్వర్యంలో ప్రతి కార్మికునికి కనీస వేతనం 26000 ఉండాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది.కార్మికుల హక్కుల సాధించడం కోసం అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాలను అనుసరించే విధానాన్ని ఎండగట్టాలని.భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలి.కేంద్ర బిజెపి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగు తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ బండ హమాలి అధ్యక్షుడు కొంకట చంద్రయ్య మైసా చేరాలు కొడిమాల వెంకటేష్ అందేసి రవి మోర మహేష్ కొమ్ముల రవి చిరంజీవి సారయ్య రాజపెళ్లి శంకర్ అధికారులు,తదితరులు
పాల్గోన్నారు.










