బాహుబలంన్యూస్ హుజురాబాద్ మే 29
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ని పట్టణంలో ఆగ్రోస్ రైతుసేవా కేంద్రం నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆగ్రోస్ రైతు సేవ కేంద్ర సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సంఘం అధ్యక్షులుగా జమ్మికుంట పట్టణానికి చెందిన బుర్ర మల్లికార్జున్,అలాగే జిల్లా ఉపాధ్యక్షులుగా పట్టణానికి చెందిన శనిగరం కొమురయ్య ఏకగ్రీవంగా ఎన్ని కైనారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఆగ్రోస్ సేవా కేంద్రం నుండి రైతులకు తక్కువ ధరకే విత్తనాలను సరఫరా చేయడం ద్వారా రైతులకు తక్కువ ధరకు కొన్న విత్తనాలను పంటగా వేయడం ద్వారా అధిక దిగుబడిని పొందుతారని, అలాగే నకిలీ విత్తనాలకల్తీని అరికట్టవచ్చని వారు తెలిపా రు.రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇంకా వారికి సబ్సిడీ ద్వారా యూరియా,విత్తనాలతో పాటు,వ్యవసాయ పని ముట్లనుఅందించినట్లయితే రైతులకు అనేక లాభాలు కలుగు తాయని తెలిపారు.ఇకమీదట రైతులకు అన్ని రకాలపంటలు వేయడానికి వేరుశనగ,వడ్లు,పత్తి,మిర్చి,కందులు,పెసర్లు మొదలగు విత్తనాలను ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం నుండి పొందవచ్చునని తెలిపారు.ఈ సంఘం కార్యదర్శిగా మధుకర్ రెడ్డి చెల్పూర్ నుండి,కోశాధికారిగా ప్రణయ్ బేతిగల్ నుండి కార్యవర్గ సభ్యులుగా కృష్ణమూర్తిని ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగింది.నూతనంగా ఎన్నికైన కమిటీ రైతులకు అందుబాటు లో నుండి వారి అవసరాలను గుర్తించి తగిన సేవ చేస్తామని అలాగే జిల్లాలోని అన్ని ఆగ్రోస్ రైతుసేవా కేంద్ర నిర్వాహకుల ను కలుపుకొని పోయి సేవలను కొనసాగిస్తామని తెలిపారు.










