బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 27
హుజురాబాద్ పట్టణానికి చెందిన గండు ప్రశాంత్ యాదవ్ ఎన్ ఎస్ యు ఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కి సంబంధించిన పత్రాన్ని సోమవారం ఆయన అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తనని జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు.తన ఎంపికకు కృషి చేసిన ఎన్ ఎస్ యు ఐ ఏ ఐ సి సి ఇంచార్జ్ కన్హయ్య కుమార్, జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి,ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్,రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఫహద్,ప్రతిక్ సింగ్,జిల్లా ఇంచార్జ్ నిరంజన్, జిల్లా అధ్యక్షుడు మునిగంటి అనిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.దీంతో పాటు తనకు ప్రత్యేకంగా పరోక్షంగా
సహకరించిన నియోజకవర్గ నాయకత్వానికి కృతజ్ఞుడనై ఉంటానన్నారు.తనపై నమ్మకంతో అప్పజెప్పిన పదవిని సక్రమంగా నిర్వహించి విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అన్నారు.










