బాహుబలం న్యూస్ మే 18 హుజురాబాద్ .
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలోని ముదిరాజుల ఆరాధ్య దైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ముదిరాజులు శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుర్జి శ్రీనివాస్ స్వామి,శ్రీహరిహర పీఠం వ్యవస్థాపకులు కుర్జీ ఆదిశేష వర్ధనస్వామి ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అమ్మవారికి నవ కలశ స్థాపన,అభిషేక కార్యక్రమంను పెద్ద ఎత్తున నిర్వహించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.పెద్దమ్మ తల్లి ఆశీస్సుల తో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధి గా కురిసి,పాడి పంటలు బాగా పండాలని,గొడ్డు గోదా సల్లం గా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.భవిష్యత్తులో మరిం త ఐక్యతగా ఉండి అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహి స్తామని తెలిపారు.
అనంతరం పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పెసరి సంపత్, ఉపాధ్యక్షుడు గుళ్ల రమేష్,కార్యదర్శి కుందేళ్ళ సమ్మయ్య,కుల పెద్ద మనిషి గుళ్ళ వెంకటయ్య,గుళ్ళ శ్రీనివాస్,పొన్నం వెంకటయ్య, రొయ్యల జనార్దన్, బొల్లి శ్రీనివాస్, నీల కృష్ణా, నీల శ్రీనివాస్,పర్శవేని విజయ్ కుమార్,బొల్లి నరేష్,బొల్లి సురేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










