హుజురాబాద్/ మే07(బాహుబలం): గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న ఉపాధి హామీ కూలీల పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూలీ ధరలు పెంచేలా చర్యలు తీసుకుంటారని హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. మంగళవారం మండలంలోని చెల్పూర్, కందుగుల గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, పది సంవత్సరాల బిజెపి పాలనలో ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేదన్నారు. రామరాజ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందుతాయని ప్రణవ్ అన్నారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్,చెల్పూర్ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు పోలంపల్లి శ్రీనివాసరెడ్డి, సమ్మెట సంపత్ కుమార్, పుల్ల రాధ, మ్యాడిద జైపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎండి ఇబ్రహీం ఎడవల్లి సతీష్ రెడ్డి, శనిగరం రమేష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










