హుజరాబాద్ లో అక్రమ రియల్ దందాపై …. సీఎంకు, తుమ్మేటి ఫిర్యాదు….

బాహు బలం న్యూస్ హుజూరాబాద్:హుజురాబాద్, జమ్మికుంట పట్టణ శివార్లలో గత కొద్ది కాలంగా జరుగుతున్న భూ ఆక్రమణలు అక్రమ భూ దందాలు, అక్రమ రియల్ ఎస్టేట్ వ్యాపారం పై సీనియర్ కాంగ్రెస్ నేత జమ్మికుంట వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సీఎం ఏ రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంటకు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో తుమ్మేటి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అక్రమ రియల్ ఎస్టేట్ దందాపై సమగ్రంగా వినతి పత్రం సమర్పించారు. హుజురాబాద్ పట్టణంలో కరీంనగర్ వరంగల్ రహదారి పక్కన దళితులకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల్లో కొందరు ప్రముఖులు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే బోర్నపల్లి రంగాపూర్ వద్ద అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేశారని, ఇందులో మున్సిపాలిటీకి రావాల్సిన భూమి ఇవ్వలేదని, వెంచర్లలో మౌలిక సదు- పాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. అక్రమ రియల్ వ్యాపారానికి సబ్ రిజిస్ట్రార్ సహకరిస్తున్నారని ఈ విషయమై సమగ్ర విచారణ చేసి ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా అక్రమ రియల్ వ్యాపారం పై భూ ఆక్రమణలపై అసైన్డ్ భూముల కొను గోలు పై తుమ్మేటి సమ్మిరెడ్డి సీఎం రేవంత్ ఫిర్యాదు చేయడం స్థానికంగా సంచలనం సృష్టించే సీఎం కు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు ఏం తీసుకుంటారో
వేసి చూడాల్సిందే.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….