కోడ్ ఉల్లంఘనలా.. అయితే ఫిర్యాదు చేయండి -సలహాలు, సూచనల కోసం ఎన్నికల పరిశీలకులను సంప్రదించవచ్చు -జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి – ఎన్నికల సాధారణ పరిశీలకులు అమిత్ కటారియా మొబైల్ నెంబర్ 9177435833 -ఎన్నికల పోలీస్ పరిశీలకులు మనీష్ చౌదరి మొబైల్ నెంబర్ 7032800525 -ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్వినీ కుమార్ పాండే మొబైల్ నెంబర్ 903265953

( బాహు బలం ప్రతినిధి వేంకట్ సబ్బని) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల అంశాలకు సంబంధించి కోడ్ ఉల్లంఘనతో పాటు. ఏమైనా ఫిర్యాదులు, సూచనలు, సలహాల కోసం ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల పరిశీలకులను కలువచ్చని, లేదా ఫోన్లోనైనా సంప్రదించవచ్చని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కరీంనగర్ చొప్పదండి, మాన కొండూర్ సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, హుస్నాబా ద్ అసెంబ్లీ సిగ్మెంట్ల వారీగా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యా దులు, సూచనలు,సలహాల కోసం ఎన్నికల సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా మొబైల్ నంబర్ 9177435833 లో సంప్రదించవచ్చని చేయవచ్చని పేర్కొన్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 మండ లాలు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎన్నికల సాధారణ పరిశీలకులు ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రజలకు అందు బాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేసేవారు స్వయంగా కానీ లేదా ఫోన్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నగదు, మద్యం, ఇతర సామగ్రి తరలింపును అడ్డుకోవడం తోపాటు ఓటర్ల ను ప్రలోభపెట్టే అంశాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల పోలీస్ వరిశీలకులు, బపీఎస్ అధికారి మనీష్ చౌదరిని మొబైల్ నెంబర్ 7032800525 లో సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కరీంనగర్ లోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎన్నికల పోలీస్ పరిశీలకులు ప్రతి రోజు ప్రజలకు అందు బాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….