కాంగ్రెస్  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మత్స్య కారులైన ముదిరాజ్ లను బి.సి.ఎ లో చేర్చాలి.. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య 

హుజూరాబాద్ ఏప్రిల్ 22(బాహు బలం)
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మత్స్యకారులైన ముదిరాజ్ లను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ లపై కుట్రలు రజక సంఘాలకు సమంజసమా..? ఆని ముది రాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య అన్నారు ఈ సందర్భంగా ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరాలు మారిన తల రాతలు మారని ముదిరాజ్ లను గత కెసిఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులుగా గుర్తించినప్పటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డీ లోనే కొనసాగించడం సమంజసం కాదని ముదిరాజుల అభివృద్ధిని అడ్డుకోవడం రజక సంఘాల నాయకులకు కూడా భావ్యం కాదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అన్నారు.
దశాబ్దాల కాలంలో కుంటలలో చెరువులలో చేపలు పట్టుకొని జీవిస్తూ చేపల వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్న ముదిరాజు ల పైన రాష్ట్ర రజక సంఘం నాయకులు పూసాల సంపత్ కు ఎందుకు కడుపు మంట??అని అన్నారు.

సంఘ నాయకులు వారి సంఘ అభివృద్ధి చూసుకోవాలి కానీ పక్క కులాల ఎదుగుదలను అడ్డుకోవడం ఏమిటని సమ్మయ్య ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా క్షేత్రస్థాయిలో బీసీ కమిషన్ ద్వారా ముదిరాజ్ ల జీవన విధానం స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అనంతరమే బీసీ డీ నుండి బీసీఏలోకి మార్చుతూ జీవో ఎంఎస్ నెంబర్ 15 ని తెచ్చిందని అప్పుడు అడ్డుకున్న రజక సంఘం మళ్లీ ఇన్నాళ్లకు ముదిరాజ్ లకు బీసీఏలోకి వచ్చే అవకాశాలు వస్తే మళ్లీ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ ముదిరాజులను బిసిఏ లో కి రాకుండా అడ్డుకుంటాం అనడం హేయమైన చర్య అని కోలిపాక సమ్మయ్య ముదిరా జ్అన్నారు.ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసిఆర్ ప్రభుత్వంలో పూర్తి మత్స్యకారులుగా గుర్తించబడ్డ ముదిరాజ్లను వెంటనే బిసి ఏ లోకి మార్చుతూ జీవో తీసుకురావాలని లేదంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుల సంఘాలతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని నమ్మవలసి వస్తుందని కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !