హుజురాబాద్ ఏప్రిల్ 21
బాహుబలం న్యూస్ : హుజురాబాద్ కు
చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ముక్క కృష్ణ.మూర్తి మనువడు. డాక్టర్ నవీన్, స్వాతి కుమారుడు.ముక్క నివేష్ (20) అమెరికా లోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముక్క నివేష్ (20) మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే ముక్క నివేశ్ గత సంవత్సరం జనవరిలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేయడానికి అరిజోనా రాష్త్రం లోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు.ప్రస్తుతంనివేశ్ రెండో సంవత్సరం చేస్తున్నాడు.ఈరోజు కళాశాలకు వెళ్లి తిరిగి కారులో వస్తుండగా వెనుకనుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొనడంతో నివేష్తో పాటుగా తన సహచర విద్యార్థి గౌతమ్ సైతం మృతి చెందినట్లు నివేష్ తల్లిదండ్రులు నవీన్,స్వాతిలు తెలిపారు. కాగా సంఘటన పై అరిజోనాపోలీసులు సమాచారం అందిం చడంతో తదుపరి చర్యల కోసం ముక్క డాక్టర్ల అభిమానులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
