బాహు బలంన్యూస్, హైదరాబాద్: అక్టోబర్ 17;
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈనెల 18న (రేపు) తలపెట్టిన రాష్ట్ర బంద్కు తెలంగాణ చేనేత పద్మ సమైక్య సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్ను విజయవంతం చేయాలని సమైక్య రాష్ట్ర కమిటీ ప్రజలకు, వివిధ సంస్థలకు విజ్ఞప్తి చేసింది.
వ్యాపార, విద్యా సంస్థలు సహకరించాలి:
బంద్కు పట్టణ, మండల, గ్రామీణ ప్రాంతాలలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మరియు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, బంద్లో పాల్గొని బీసీల రిజర్వేషన్ డిమాండ్కు మద్దతు తెలపాలని తెలంగాణ చేనేత పద్మ సమైక్య రాష్ట్ర సీనియర్ ఆర్గనైజర్ జడల చిరంజీవి డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శులు, పట్టణ, మండల కార్యదర్శులు, ఇతర పద్మశాలి నాయకులతో కలిసి ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
సామాజిక న్యాయం కోసం రిజర్వేషన్లు:
ఈ సందర్భంగా జడల చిరంజీవి మాట్లాడుతూ… రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన బీసీలు రిజర్వేషన్లు లేకపోవడంతో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు జరిగితే అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో సమాన అవకాశాలు కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కొందరు దురుద్దేశంతో రిజర్వేషన్ అంశాన్ని కోర్టులకు వెళ్లి రాజకీయం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆయన విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు సాగాలని ఆయన కోరారు.
బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి:
ఈ డిమాండ్తో ఈనెల 18వ తేదీన జరగనున్న రాష్ట్ర బంద్కు తెలంగాణ చేనేత పద్మ సమైక్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, పట్టణ వ్యాపార, వాణిజ్య పుర ప్రముఖులు, విద్యాసంస్థల యాజమాన్యాలు అందరూ సహకరించి అందులో పాల్గొనాలని తెలంగాణ చేనేత పద్మ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.










