బాహుబలం న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 10
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాది సనాతన ధర్మం పేరుతో ప్రధాన న్యాయమూర్తిని కించపరచడం అంటే భారత న్యాయవ్యవస్థను అవమానించినట్టేనని ఇలాంటి దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన న్యాయవాదిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాసు వడ్లూరి న్యాయవ్యవస్థను కోరారు.
Post Views: 143










