బాహు బలంన్యూస్ కేశపట్నం, జూలై 18: కేశపట్నం మండల తహసిల్దార్గా విధులు నిర్వర్తిస్తున్న సురేఖ మేడం, నిస్వార్థ సేవ, నిజాయితీ, అంకితభావాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. కేవలం విధులు నిర్వర్తించడమే కాకుండా, ప్రజా సంక్షేమాన్ని తన భుజస్కంధాలపై మోస్తూ, ఆమె తీసుకుంటున్న చొరవ ప్రజల మన్ననలను పొందుతోంది.
తాజాగా గురువారం రోజు వర్షంలో కూడా వెనకడుగు వేయకుండా, కలెక్టర్ ఆదేశాల మేరకు చూచన తప్పకుండా, మొలంగూరు గ్రామ శివారులోని అక్రమణకు గురైన ప్రభుత్వ భూముల ఆక్రమణలను స్వయంగా పరిశీలించి, వాటిని తొలగించేందుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, గొడుగు పట్టుకుని రెవెన్యూ, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి దాదాపు 16 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమిని (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించినవి) క్షేత్ర స్థాయిలో పరిశీలించడం ఆమె అంకితభావానికి నిదర్శనం. అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లు, కొట్టములను తక్షణమే తొలగించాలని ఆమె ఆదేశించడంతో, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ పట్ల ఆమెకున్న నిబద్ధత స్పష్టమైంది…
మేడంకు సెల్యూట్, మేడంకు వందనం”
TJS జిల్లా అధ్యక్షులు మోరె గణేష్..
TJS జిల్లా అధ్యక్షులు మోరె గణేష్ వంటి నాయకులు సైతం సురేఖ మేడం సేవలను కొనియాడుతూ, “మేడంకు సెల్యూట్, మేడంకు వందనం” అంటూ ప్రశంసించారు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద ఇంటి స్థలాలు మంజూరు చేసి, ఇందిరమ్మ ఇళ్లు అందించడానికి కృషి చేస్తానని ఆమె ఇచ్చిన హామీ, ఆమె గొప్ప మనసును, పేదల పట్ల ఆమెకున్న సానుభూతిని తెలియజేస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే అధికారులు తమ ప్రాంతానికి రావడం గర్వకారణమని ప్రజలు భావిస్తున్నారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తహసిల్దార్ సురేఖ మేడం, ఒక ఆదర్శవంతమైన అధికారిణిగా, ప్రజా నాయకురాలిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నారు. ఆమె సేవలు మరింత మందికి ఆదర్శంగా నిలవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.










