బాహు బలంన్యూస్ హుజురాబాద్,జూన్ 17: ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, నిబంధనలు పాటించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హుజురాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు పాఠశాల ఫీజుల వివరాలను తప్పనిసరిగా బోర్డుపై ప్రదర్శించా లని ఆప్ నాయకులు డిమాండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మైఖేల్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ,అనేక ప్రైవేటు పాఠశాలలకు క్రీడా మైదానాలు లేకపోయినా,వాటిని ఉన్నట్లుగా చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.అధికారులు ఈ అక్రమ వసూళ్లను పట్టించుకోవడం లేదని,దీనిపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆప్ నాయకులు మైఖేల్ శ్రీనివాస్ గౌడ్తో పాటు బీజేపీ నాయకులు జంపాల రాజు కూడా పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.










