బాహు బలంన్యూస్ కమలాపూర్, జూన్ 10:
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బహుజనులైన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా నేడు కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ దళిత నాయకుడు పోడేటి బిక్షపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో బహుజనవాదం విరజిల్లుతోందని కొనియాడుతూ ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసారు.
ఈ సందర్భంగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిమండలిలో ఉన్నత స్థానాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నప్పటికీ, మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ఎస్సీలు), వాకాటి శ్రీహరి (బీసీ), రామచంద్రనాయక్ (ఎస్టీ) లకు ఉన్నత స్థానాలు కల్పించడం, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బహుజనుల పార్టీగా, బలహీన వర్గాల పక్షపాతిగా నిరూపించుకుందని పేర్కొన్నారు.
జాతీయస్థాయిలో అగ్రవర్ణాల పక్షపాతి అయిన బీజేపీతో పోరాడుతూ, గతంలో దొరల కుటుంబానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసిన గాయాలకు చికిత్స చేసుకుంటూ, ఎస్సీ, ఎస్టీ, బీసీలను భుజాన ఎత్తుకొని ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజానీకం సంపూర్ణ మద్దతు తెలుపాలని తౌటం ఝాన్సీరాణి రవీందర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుండపు చరణ్ పటేల్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బాలసాని రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ మాట్ల రమేష్, తడక శ్రీకాంత్, పుల్లూరి శ్రీనివాసరావు, డాక్టర్ మౌటం కుమారస్వామి, మాట్ల రవీందర్, చెరుపల్లి రామచంద్రం, మార్కెట్ డైరెక్టర్లు మిల్కూరి శ్రీనివాస్, అకనపల్లి బిక్షపతి, ఓరుసు తిరుపతి, ఇల్లంతకుంట దేవస్థానం డైరెక్టర్ రెక్కల నారాయణరెడ్డి, పెరుమాండ్ల పరశురాములు, కొండ రమేష్, కొండపాక మనీష్, పల్లె సమ్మిరెడ్డి, పుల్ల శోభన్, మారపల్లి మహేష్, కొండ తిరుపతి, గూడెపు మొగిలయ్య, భాష బోయిన రమేష్, ధర్మల సదానందం, మాట్ల రాజేష్, మారెపల్లి సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.










