మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణకు హుజురాబాద్‌లో ప్రత్యేక పూజలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ జూన్ 10: మానకొండూరు ఎమ్మెల్యే మరియు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినం సందర్భంగా ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో పదవులు అధిరోహించి ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని, ఎల్లవేళలా దేవుని కృప ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పూజలు జరిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొలిపాక శంకర్, డైరెక్టర్లు బల్లు పున్నం చందర్, మాచర్ల నరేష్ గౌడ్, బూసరపు శంకర్, రమేష్, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పు శ్రీనివాస్, సొల్లు దశరథం, ఎర్ర నాగరాజు, గాలీబ్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !