బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 24: తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ వేడుకల పోస్టర్ను శనివారం హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి ఆవిష్కరించారు. టీయూడబ్ల్యూజే హెచ్143 జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ నెల 31న హైదరాబాద్లోని జలవిహార్ ఆడిటోరియంలో “తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అనే నినాదంతో టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హుజురాబాద్ టీయూడబ్ల్యూజే హెచ్143 యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అడహక్ కమిటీ కన్వీనర్ గూడూరి కొండల్ రెడ్డి, కో కన్వీనర్లు కోయల్ కార్ శ్యామ్, కనకం శ్రీనివాస్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మండల యాదగిరి, జర్నలిస్టులు,సబ్బని వెంకటేష్, మధుకర్
నరేష్,సుంకరి రాజమౌళి, శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.










