టీజేఎఫ్ రజతోత్సవ వేడుక పోస్టర్ ఆవిష్కరణ: జర్నలిస్టులకు పిలుపు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్, మే 24: తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) రజతోత్సవ వేడుకల పోస్టర్‌ను శనివారం హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి ఆవిష్కరించారు. టీయూడబ్ల్యూజే హెచ్143 జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ నెల 31న హైదరాబాద్‌లోని జలవిహార్ ఆడిటోరియంలో “తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అనే నినాదంతో టీజేఎఫ్ రజతోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హుజురాబాద్ టీయూడబ్ల్యూజే హెచ్143 యూనియన్ నాయకులు మాట్లాడుతూ, జర్నలిస్టులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అడహక్ కమిటీ కన్వీనర్ గూడూరి కొండల్ రెడ్డి, కో కన్వీనర్లు కోయల్ కార్ శ్యామ్, కనకం శ్రీనివాస్, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మండల యాదగిరి, జర్నలిస్టులు,సబ్బని వెంకటేష్, మధుకర్
నరేష్,సుంకరి రాజమౌళి, శ్రీనివాస్,రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !