హుజురాబాద్‌లో ఘనంగా పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి మే 8:
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్-వరంగల్ రహదారిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సెంటర్ వద్ద నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో పొన్నం ప్రభాకర్ పోరాటం ఎంతో గొప్పదని కొనియాడారు. స్వరాష్ట్రం వచ్చే వరకు ఆయన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో ముందుండి యువతకు స్ఫూర్తినిచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రిగా బడుగు బలహీన వర్గాలకు ఆయన అండగా నిలుస్తున్నారని వారు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సందమల్ల బాబు, బీట్ల వెంకటేష్, బత్తిని రవీందర్ గౌడ్, సందమల్ల నరేష్, జంగ అనిల్ కుమార్, కొలుగూరి సమ్మయ్య, వెలిశాల నారాయణ, కొత్తగట్టు చక్రపాణి, మోరే ఉపేందర్, సాదిక్ ముక్క రవితేజ, గాదె శ్రీకాంత్, మోరే సంపత్, కట్కోజు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..