పోతిరెడ్డిపేటలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

బాహు బలంన్యూస్ హుజురాబాద్,ప్రతినిధి,ఏప్రిల్ 14: పోతిరెడ్డిపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మంతెన సురేందర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, అట్టడుగు, అణగారిన వర్గాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన నిలిచారని తెలిపారు. అంబేద్కర్ జన్మదినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవంగా ప్రకటించడం ద్వారా ఆయనను ప్రపంచ మేధావిగా గుర్తించడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.
కు వివక్ష, అంటరానితనంపై అంబేద్కర్ చేసిన అవిరళ పోరాటాన్ని ఆయన గుర్తు చేశారు. స్త్రీ సాధికారత కోసం ఆయన నిరంతరం కృషి చేశారని కొనియాడారు. విద్యాభివృద్ధికి అనేక కళాశాలలు స్థాపించి విద్య పట్ల ఆయనకున్న మక్కువను చాటుకున్నారని తెలిపారు. అంబేద్కర్ భారత ప్రజల గుండెల్లో ఎప్పటికీ అజరామరుడుగా నిలుస్తారని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి కిరణ్ కుమార్, చొల్లేటి మల్లారెడ్డి, పున్నం రాజేందర్, దేవునూరి రవీందర్, నరుకుడు ప్రభాకర్, నందిపేట పరమేశ్వర్, దేవునూరి బాబు, పొడిసెట్టి రాజ్ కుమార్, చందుపట్ల రాజేందర్, చెన్నోజు భద్రయ్య, గూళ్ల శ్రీనివాస్, మూల చంద్రశేఖర్ రెడ్డి, మామిడి రమేష్, వెన్నంపల్లి శ్రీనివాస్, బండ అజయ్, గాజుల సమ్మయ్య, చొల్లేటి రాధా కిషన్, కాలేశ్వరం కార్తీక్, చొల్లేటి హరికిషన్, గాజుల అశోక్, ఎలుకపల్లి మనీ కుమార్, శనిగరం కుమార్, చొప్పరి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..