బాహుబలం న్యూస్,హుజురాబాద్ ప్రతినిధి: మార్చి 16:
త్రిమత ఏకైక గురువు,ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల దివ్య ఆశీసులతో అది వారం రోజున హుజూరాబాద్ పట్టణములోని విద్యా నగర్ ఏరియా లో త్రైత సిద్ధాంత తెలుగు యుగాది క్యా లెండర్ (త్రైతశకం-47) లను శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు,అనంతరం త్రైత శకం తెలుగు క్యాలెం డర్ లను ఇంటింటా వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారు రచించిన ఈ జ్ఞాన తెలుగు కాలసూచిక లో ఎన్నో భగవద్గీత వచనాలను జోడించి ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అర్థం అయ్యే విధానంగా రూపొందించడం జరిగింది అని వారు అన్నా రు..ఈ కాలసూచికలో ఇంకా చాలా విశేషాల్లో భాగంగా దేవాలయం సంప్రదాయాల్లో ఆత్మజ్ఞానం, తెలుగు పండుగ ల విశిష్టత, మరియు తెలుగు నెలల విశిష్టత, త్రైత సి ద్ధాంత భగవద్గీత శ్లోకముల సారముతో పాటు ప్రతి సమ స్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాం శం ఇందులో పొందుపరిచి స్వామివారు రచించడం జరి గిందన్నారు. తెలుగు నెలలు అనుసరిం చుటకు వీలుగా తెలుగు తిథుల తో ఆంగ్ల తేదీలను పొందుపరచి తయారు చేసిన ఇటువంటి గొప్ప కాల సూచికను అందించడం ప్రజ లందరూ హర్షించదగ్గ విశేషం అన్నారు. కార్యక్రమంలో త్రైతసిద్ధాంతం-ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక- హుజూరాబాద్ కమిటీ అధ్యక్షుడు, సభ్యులు రవీందర్ రెడ్డి , శ్రీదేవి , నక్షత్ర , గోపి, రామస్వామి, పద్మ, సాయి, సంతోష్ , కుమార్, రాధిక, సతీష్ చారి , జ్యోతి, హర్ష, నాగవర్ధన్ లు పాల్గొన్నారు.










