సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి
హుజురాబాద్ ఫిబ్రవరి 14: ఉమ్మడి కరీంనగర్, మెదక్, అదిలాబాద్ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ప్రకటించడం తో నరేందర్ రెడ్డి గెలుపు కోసం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శుక్రవారం జమ్మికుంటలోని ప్రచారం నిర్వహించారు. జమ్మికుంటలో పెద్దాంపల్లి రోడ్డు లో గల జిరాక్స్ సెంటర్లోని మొహమ్మద్ సందాని అనే పట్టభద్రున్ని ఈ నెల 27 తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని ఎర్ర శ్రీనివాస్ అభ్యర్థించాడు. తను కూడా నరేందర్ రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తానని నాతో పాటు నాకు తెలిసిన పట్టభద్రులను కూడా నరేందర్ రెడ్డి కే మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్తానని తెలిపాడని అన్నారు. ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.కొన్ని సంవత్సరాలుగా నరేందర్ రెడ్డి విద్యారంగంలో ఎనలేని కృషి చేశారని విద్యార్థి సమస్యల పట్ల నిరుద్యోగ సమస్యల పట్ల పట్టభద్రుల సమస్యలపట్ల నరేందర్ రెడ్డి కి పూర్తిస్థాయి అవగాహన ఉందని అలాంటి నాయకులు శాసనమండలి లో ఉంటే ప్రజా సమస్యలను ముఖ్యంగా పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తారని కాబట్టి ఉమ్మడి మెదక్ నిజామాబాద్ అదిలాబాద్ కరీంనగర్ పట్టభద్రులు ప్రతి ఒక్కరు నరేందర్ రెడ్డి రెడ్డికే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన పట్టభద్రుల ను వేడుకుంటున్నాడు.అలాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నరేందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ కమిటీ తరఫున నరేందర్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.










