( బాహుబలం న్యూస్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి)
హుజురాబాద్, ఫిబ్రవరి 13 :తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) 2025 డైరీ ని గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో హుజరాబాద్ టౌన్ సిఐ గుర్రం తిరుమల్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పాత్రి కేయులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాసమ స్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల పని తీరును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్, కో- కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కాయిత రాములు, జర్నలిస్టులు కేసిరెడ్డి నరసింహారెడ్డి, నంబి భరణి కుమార్, చిట్టంపల్లి సృజన్ తేజస్విరాజ్, చిలుక మరి సత్యరాజ్, పబ్బ తిరుపతి, శ్రీధర్, టేకుల సాగర్, కుడికాల సాయి, పోతురాజు సంపత్, చిర్ర సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70










