స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులు…

బాహు బలం న్యూస్ ప్రతినిధి సైదాపూర్ ఫిబ్రవరి 12
సైదాపూర్ మండలంలోని వెనుకేపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్య సమస్యతో అకాల మరణం పొందిన చిరకాల స్నేహితుడు కుటుంబానికి అండగా మేమున్నామంటూ ముందుకు వచ్చి స్నేహం అన్న మాటకు సరైన నిర్వచనాన్ని అందించారు. సాటి మిత్రులు సైదాపూర్, వెనకేపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2002-03 పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తమవంతుగా మిత్రుని జంపాల రాజేందర్ కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పించి రాజేందర్ కూతురుకి రూ.56000 పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ డిపాజిట్ సేకరించి బుధవారం కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా పలువురు స్నేహితులు మాట్లాడుతూ ఈ లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటిలేదని అందరితో మమేకమై కలివిడిగా కష్టసుఖాలను పాలుపంచుకునే ఆప్త మిత్రుడు దూరమవ్వడం చాలా బాధాకరమని భౌతికంగా మా మధ్య లేకపోయినా అతని భావాలు మాపై చూపించిన ఆధారాభిమానాలు ఏనాటికి చెరగని స్మృతులుగా మా మధ్య మెదలాడుతూనే ఉంటాయని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. మిత్రుడు జంపాల రాజేందర్ కుటుంబానికి ఎల్లవేళలా తమవంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !