ముఖ్యమంత్రి గారు.. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించరా ? -పి.డి.ఎస్.యు.రాష్ట్ర నాయకురాలు పి.అనుష, కేయూ కన్వీనర్ బాలు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి వరంగల్ ఫిబ్రవరి 13
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాడి సంవత్సరంన్నర కాలం పూర్తికావోస్తున్నప్పటికి
నేటికీ రాష్టానికి విద్యాశాఖ మంత్రిని నియమించక పోవడం సిగ్గుచేటని పి.డి.ఎస్.యు. రాష్ట్ర నాయకురాలు పి.అనూష, కేయూ కన్వీనర్ బాలు తీవ్రంగా ఆక్షేపించారు.
బుధవారం కేయూ లో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ కమిటీ సమావేశం జరిగింది.
ఈసందర్భంగా పి.అనూష, బాలు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యరంగాభివృద్ధి పట్ల, విద్యార్థుల సంక్షేమం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలని, గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, ప్రాథమిక విద్యలో విద్యా హక్కు చట్టానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిటెన్షన్ విధానాన్ని ఉపసంహరించుకోవాలని, మోడీ ప్రభుత్వం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేందుకు తీసుకువచ్చిన యూజీసీ ముసాయిదా- 2025 ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే అమెరికాలో భారతీయ పౌరులపై డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ నాయకులు గణేష్, యాదగిరి, హరికృష్ణ, గని, రాజశేఖర్, రాజకుమార్, సాయి, నాగరాజు, చందన, సాధన, మానస, శ్రీజ, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !