బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 03
హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇటీవల బదిలీపై వచ్చిన కె. సమ్మయ్య ని “పీవీ సేవా సమితి,”సిద్దార్థ్ నగర్ కాలని హుజురాబాద్ వారు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి భగవద్గీతను బహుకరిం చారు. కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో బాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమా లు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు. మున్సిపాలిటీ నిర్వహించే సేవ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తామని అన్నారు. *పీవీ సేవా సమితి,* సిద్దార్ నగర్ కాలని అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి సాగి వీరభద్ర రావు మాట్లాడుతూ హుజూ రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు అయినప్పటి నుండి అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం…తోపాటు బల్దియా పరిధిలోని సమస్యలపై అవగహన, అంకితభావం ఉండడం అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో తమ సంస్థలద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు . భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల మన్ననల ను పొందాలని సూచించారు. అలయన్స్ అద్యక్షుడు, కోశాధికారి బి.మనోజ్, బి. రామ లింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. మాధవ రావు పిడి రాజి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, వేల్పుల ప్రభాకర్, కాసర్ల శ్రీహరి ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు…










