బాహు బలం న్యూస్ కరీంనగర్ జనవరి 15:
అన్నదాతలకు అత్యంత ప్రీతి పాత్రమైనది కనుమ పండుగ అని ఏడాది పొడవునా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు,ఎద్దులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించి,వాటిని ప్రేమతో చూసుకునే కర్తవ్యాన్ని ఈ కనుమ బోదిస్తుందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నాదాతలందరికి కనుమ పండుగ శుభాకాం క్షలు తెలిపారు.మీ ఇల్లు దాన్యారాశులతో నిండుగా,పాడి పంటలతో పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షించారు.ఎంత ఎదిగినా,కాలంమారినా తరగని అనుబంధ సంపద మనదని మన విలువలను కాపాడుకుంటూ,మన సంప్రదాయాలను మరిచిపోకుండా ముందుకు సాగుదామన్నారు.ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి ఎద్దులను,గోవులను పశుసంపదను పెంచుతూ సేంద్రియ,ప్రకృతి వ్యవసాయంచేసి ఆరోగ్యకరమైన కాలుష్యరహిత జీవనాన్ని గడపాలని రామారావు కోరారు.
Post Views: 170










