హాస్టళ్లు, స్కూళ్లను సందర్శించనివ్వొద్దని ఆర్డర్ లేదు – అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్.

బాహు బలం న్యూస్ కరీంనగర్ జనవరి 07; ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలను విద్యార్థి, ఇతర సంఘాలు గాని సందర్శించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, సందర్శ నలకు అవకాశం ఇవ్వద్దని తమ నుండి ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదని కరీంనగర్ అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ (లోకల్ బాడీస్) స్పష్టం చేశారు.వార్డెన్లు, ప్రిన్సిపల్ లు హాస్టళ్లు పాఠశాలల సందర్శనను అడ్డుకుని, ఎవరిని లోనికి అనుమతించవద్దని కలెక్టర్ ఆర్డర్ ఉందని తెలప డంతో,ఎస్సి,ఎస్టీ,బీసీ, మైనారిటీ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడానికి తీన్మార్ మల్లన్న టీంకి అనుమతులు ఇవ్వాలని కోరుతూ టీం జిల్లా అధ్యక్షుడు అఖిల్ పాషా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.అఖిల్ పాషా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లాలో పలు ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు సందర్శించడానికి వెళ్లగా ఎవరిని లోపలికి రానివ్వొద్దు, ఎలాంటి సందర్శనలు చేయరాదు, ఎవరికి అనుమతులు ఇవ్వకుండా గేట్లకు తాళాలు వేసి, వచ్చిన వారిని బయట నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ గారి నుండి ఆదేశాలు ఉన్నాయని అన్నట్లు తెలిపా రు.విద్య వ్యవస్థలో ప్రభుత్వ అధికారుల తీరు బాగలేక, వారి నిర్లక్ష్య కారణంగానే ఫుడ్ ఫైజన్లు జరిగి విద్యార్థులు ప్రాణాలు కొల్పుతున్నారని, కొన్ని హాస్టల్స్ లో ప్రభుత్వం నుండి వచ్చే వంట సామగ్రి దొడ్డి దారిన పట్టిస్తున్నారని, తాజాగా తిమ్మాపూర్ మైనారిటీ హాస్టల్ లో వార్డెన్, ప్రిన్సిపాల్ ఇద్దరు కలిసి బియ్యంతో పాటు మరి కొంత వంట సామగ్రిని అమ్ముకున్న దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి సంఘనల దృష్ట్యా సందర్శనకు అవకాశం ఇవ్వా లని కోరడంతో, ప్రభుత్వ హాస్టళ్లను, పాఠశాలలను సంద ర్శించడంలో అభ్యంతరం లేదని, అలా ఎలాంటి ఆర్డర్ జారీ చేయలేదని అదనపు కలెక్టర్ స్పష్టం చేసినట్లు అఖిల్ పాషా తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !