భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు , ఆయన దేశానికి అందించిన సేవలు మరువలేనివి. పోలాడి రామారావు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్
భారత మాజీ ప్రధాని , దేశ ఆర్థిక సంస్కరణల రూప శిల్పి, విజనరీ, గొప్ప మేధావి,డాక్టర్ మన్మోహన్ సింగ్ అనారోగ్యం తో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ లో మృతి చెందడం బాధాకరమని, దేశానికి తీరని లోటని, దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి,రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి దేశ 13వ ప్రధానిగా తొలి హిందూయేతర వ్యక్తిగా, క్రమశిక్షణ , నిరాడంబరతో, రోజుకు 18 గంటలు పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి విశేష సేవలు అందించి, ఉపాధి హామీ పథకం, సమాచార హక్కుచట్టం, పనికి ఆహార పథకం, పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నభోజన పథకం తీసుకు రావడం , బలహీన వర్గాల బీసీ వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని రామారావు అన్నారు.
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ లో అర్థిక శాస్త్రం లో డాక్టరేట్ అందుకొని యుజిసి చైర్మన్ గా, ప్రణాలికా సంఘం ఉపాధ్యక్షునిగా, భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, వరల్డ్ స్టేట్స్ మెన్ గా, ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతునిగా పేరుగాంచిన,ప్రముఖ ఆర్థిక వేత్త గా దేశానికి అనేక సేవలు అందించి, దేశం అర్థిక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో1991.. 96లో ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వంలో అర్థిక మంత్రిగా చేరి అనేక అర్థిక సంస్కరణలు తీసుకు వచ్చి అమలు చేసి అర్థిక సంక్షోభం నుంచి గట్టుక్కించి దేశానికి ఎంతో మేలు చేశారని, ఆ తర్వాత 10 ఏళ్లు ప్రధానిగా దేశ ఆర్థిక వృద్ధి రేటు 10.8శాతానికి నమోదు చేసి దేశంలో అనేక చోట్ల ఐఐటి, ఐఐఎం లు తీసుకు వచ్చి, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సెజ్ లు పెట్టి పారిశ్రామికంగా అభివృద్ధిచేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలు మరువలేనివని, 33ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన
ఆయన మరణం బాధాకరమని పోలాడి రామారావు తీవ్ర విచారం వ్యక్తం చేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !