న్యాయదేవతకు ‘కళ్ల గంతలు’ తొలగింపు..చారిత్రాత్మక ఘట్టం

న్యాయదేవతకు ‘కళ్ల గంతలు’ తొలగింపు..చారిత్రాత్మక ఘట్టం

ఒక చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం ప్రతిమ ఏర్పాటు

బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో కొత్తగా రూపుదిద్దుకున్న న్యాయదేవత

సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో నూతన విగ్రహం ఏర్పాటు

బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తుల సవరణల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టులు, లీగల్ ఛాంబర్లు, సినిమాలలో కళ్లకు గంతలు కట్టి కనిపించే ‘న్యాయ దేవత’ విగ్రహం రూపు మారింది. కళ్ల గంతలను సుప్రీంకోర్ట్ తొలగించింది. అంతేకాదు న్యాయ దేవత ఒక చేతిలో ఉండే ఖడ్గం స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచింది. బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు.

భారతీయ న్యాయవ్యవస్థ చిహ్నానికి కొత్త రూపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ కీలక మార్పులు జరిగాయి. తద్వారా ‘చట్టం ఇకపై గుడ్డిది కాదు’ అని సుప్రీంకోర్ట్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయింది. ఈ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చొరవ చూపించారు. మార్పుల అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.

కాగా మునుపటి న్యాయ దేవత విగ్రహం ఒక చేతిలో శిక్షకు చిహ్నంగా ఖడ్గం ఉండేది. దాని స్థానంలో అందరికీ సమానత్వాన్ని అందించే రాజ్యాంగాన్ని ఉంచారు. వలస వారసత్వాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన తరుణం ఇదని సీజైఐ డీవై చంద్రచూడ్ భావించారని సుప్రీంకోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘చట్టం గుడ్డిది కాదు. అందరినీ సమానంగా చూస్తుంది’’ అని ఆయన అన్నారని సమాచారం. అందుకే న్యాయ దేవత కొత్త రూపంలో ఈ సూత్రం ప్రతిబింబించేలా చూసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..