నివేశన స్థలాల సమస్యను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విజ్ఞప్తి..

బాహు బలం ప్రతినిధి హుజురాబాద్/అక్టోబర్ 26:
జర్నలిస్టులకు పంపిణీ చేసిన నివేశన స్థలాల సమస్యను పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు హుజురాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎల్ఎండి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయనకు వినతి పత్రం అందించారు.గత రెండు రోజుల క్రితం ఇదే విషయమై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు సైతం వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో -కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయి కృష్ణ లు మాట్లాడుతూనివేశన స్థాలాలకు సంబంధించి కోర్టు కేసు సమస్యను పరిష్కరించాలని, అలాగే ఈఎన్ సి సర్టిఫికెట్ ఇప్పించాలని కవ్వంపెల్లికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించి హుజురాబాద్ జర్నలిస్టుల నివేశన స్థలాలకు సంబంధించి రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల నివేశన స్థలాల విషయంలో సానుకూలంగా ఉందని తప్పకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నట్లు చెప్పారు.కవ్వంపల్లి ని కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ ఆడహాక్ కమిటీ సభ్యులు పోతరాజు సంపత్,వేల్పుల సునీల్ లు ఉన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….