మంగళవారం రోజున హుజురాబాద్ పట్టణంలో నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజాప్రతినిధులు రాష్ట్ర ఇంచార్జి తిప్పారపు సంపత్ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ మాట్లాడుతూ దళిత బంధు రెండో విడత విషయంలో అకౌంట్ లో ఉన్న డబ్బులు విడుదల చేయకపోవడంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పెద్ద కుట్ర దాగి ఉందని దీన్ని మా దళితులు పసిగట్టడంలో వైపల్య చెందామని.మా కంచంలో అన్నం పెట్టినట్టు పెట్టి గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ఒక రెండు నెలల్లో పూర్తి చేయవలసింది పోయి రెండు సంవత్సరాలు నాన్చి ఎన్నికల సాకుతో కౌశిక్ రెడ్డి దళితుల నోటికాడి బుక్కను కొట్టేసాడని రానున్న రోజుల్లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి దళితులు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ రెండో విడత దళిత బంధు మా దళితుల అకౌంట్లో ఉన్న డబ్బులు రిలీజ్ చేయడం కోసం మా కాంగ్రెస్ పార్టీ పై ఒత్తిడి తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు నాయకత్వంలో జిల్లా మంత్రి గౌరవ శ్రీ పొన్నం ప్రభాకర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారించే దిశగా తీసుకువెళ్తామని డబ్బులు ప్రతి దళిత కుటుంబం కు వచ్చేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామమని.అలా పరిష్కారం కానీ ఎడల మా దళిత జాతుల కోసం నిరాహార దీక్షలతో పాటు పోరాటం చేయడానికి వెనకాడబోమని మా దళిత జాతులకు అన్యాయం జరుగుతుంటే చూడబోమని దళిత బంధు విడుదల అయ్యేంత వరకు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడంతో పాటు మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని అన్నారు
ఈ సమావేశం లో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బోయిని రాజకుమార్ మాజీ సర్పంచ్,సరిగోమ్ముల అరుణ సదానందం మాజీ సర్పంచ్,పార్లపెల్లి రమేష్ మాజీ సర్పంచ్, రేణుకుంట్ల రవీందర్, మైస మేషేక్, సతీష్ మహేష్ రాజేందర్, విజేందర్, రామ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు











