సబ్బని వెంకటస్వామి బహుబలం ప్రతినిధి హుజురాబాద్; సెప్టెంబర్ 02
హుజురాబాద్ నియెజకవర్గ పరిధిలో ఉన్న ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్ దుకాణాలపై వ్వవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఖరీఫ్ సీజన్ దాదాపు పూర్తవుతున్న కూడా వ్వవసాయ శాఖ అధికారులు షాపులపై కన్నెత్తి చూడక పోవడం ఒకింత అనుమానాలకు తావిస్తోందని ఫర్టిలైజర్ షాపు యజమానులు ఇష్టరితిలో అడ్డగోలు ధరలకు విక్రయిస్తు సొమ్ము చేసుకుంటున్నారని అఖిల భారత యువజన సమాఖ్య ఎఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ లంకదాసరి కళ్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు.
అదేవిధంగా రైతుల అమాయకత్వాన్ని అసరగా చేసుకుని ధర ఉన్నదానికంటే ఎక్కువ ధర డిమాండ్ చేస్తు రైతులను దోపిడీకి గురిచేస్తున్నరని రైతులు కొనుగోలు చేసిన సరుకులకు సరియైన బిల్లులను ఇవ్వకుండా తేల్లపేపర్ మీద వ్రాసిఇస్తున్నరని ఇలా చేయడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అదేవిధంగా ప్రభుత్వ అధాయంకు ఎకనామం పెడుతున్నారని అయన అన్నారు.
తక్షణమే వ్వవసాయ శాఖ అధికారులు ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్స్ దుకాణాలను తనిఖీ చేసి నాసిరకం మందులు అమ్ముతున్న షాపులను మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న షాపులుపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వ్వవసాయ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంబంధిత వ్వవసాయ శాఖ కార్యలయలను ముట్టడిస్తామని అయన హెచ్చరించారు.










