బాహు బలం న్యూస్ హుజురాబాద్ ఆగస్టు 26:రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కు విన్నవించిన యూత్ కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ హుజూరాబాద్ మండలం,పట్టణంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని జిల్లా,మండల అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడంతో అక్రమ నిర్మాణాల పట్ల హైడ్రా తరహాలో చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పర్యులు పొన్నం ప్రభాకర్ కు యువజన కాంగ్రెస్ నాయకులు టేకుల శ్రావణ్ ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ హుజురాబాద్ మండలం మరియు పట్టణంలో అక్రమ నిర్మాణాలు యదేచ్చగా జరుగుతున్నాయని ఆక్రమార్యులు గత ప్రభుత్వ పెద్దల ప్రోద్భలంతో అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా పలు ఫంక్షన్ హాళ్లు,పాల ఉత్పత్తుల డైయిరి లు,ఏజెన్సీలు,రైస్ మిల్లులు,రెసిడెన్షియ ల్ అనుమతులు తీసుకొని కమర్శియల్ ఇండ్ల నిర్మాణాలు, చెరువులను కుంటలను ఆక్రమించుకొని చాలా వరకు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని అదే విధంగా హుజూరాబాద్ పట్టణంలో పలు గంగోనికుంట,మోదల్ చెరువు,చంద్రవోని కుంట,వరంగల్ రోడ్డులోని ప్రధాన రహదారికి అనుకొని కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల భూమిని కబ్జాలు చేసి నాలాను ఆక్రమించుకొని భూములు క్రయ,విక్రయాలు చేపడుతున్నారని పలు నిర్మాణాలు మరియు నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారని సంబంధిత అధికారుల కు ఎన్ని పిర్యాదులు చేసిన పట్టించుకోకుండా తుతూ మంత్రంగా విచారణలు,నోటీసులు పేర్లతో కాలయాపన చేస్తూ ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వీడియో సందేశంలో అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకుంటామని తెలపడంతో ఫిర్యాదు చేశామని హుజూరాబాద్ లో సైతం హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) చర్యలు చేపట్టాలని చెరువులు,కుంటలు ఆక్రమించిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.










